వీధి రౌడీలు కదు, భావి భారత ఇంజనీర్లు వీరందరూ.
కడప జిల్లా: ఇడుపులపాయ ఐఐఐటి(ట్రిపులైటీ)లో ఇంజనీరింగ్ చదువుతున్న సీనియర్ మరియు జూనియర్ విద్యార్ధుల మధ్య జరిగిన గొడవ చిలికి చిలకి చివరకు వీధి రౌడీల గొడవను తలపించింది.
E3, E4 ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ కొందరు విద్యార్ధులను హాస్పిటల్ పాలు చేస్తే మరి కొందరిని పోలీసు కౌన్సిలింగ్ తీసుకునేలా చేసింది.
అసలి విషయానికి వస్తే సీనియర్ అమ్మాయి పట్ల జూనియర్ అబ్బాయి తప్పుగా ప్రవర్తించాడట. ఈ విషయాన్ని, జీర్ణించుకోలేని తోటి సీనియర్ విద్యార్థులు సదరు జూనియర్ విద్యార్ధిపై దాడికి తెగబడ్డారు.
ఈ వివాదం కాస్తా జూనియర్ సీనియర్ విద్యార్ధుల మధ్య భీకర పోరుగా మారి, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేలా మారింది.
ఈ ఘర్షణల్లో ఐదు మంది విద్యార్థులకు గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
చివరకు ఇరువర్గాల గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. గొడవ సద్దుమణిగాక ఇరు వర్గాల విద్యార్ధులకు ఆర్కే వ్యాలీ పోలీసులు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇస్తున్నారు.