అభివృద్ధి ఫలాలు అందరికి…
పిల్లి బోస్ ప్రచారం…
మండపేట:- రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్ పేర్కొన్నారు.
మండపేట 27 వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు.
వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నీలం దుర్గ విజయం కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలను అమలు చేసిన ఘనత తమదే అని అన్నారు.
వలంటీర్ వ్యవస్థద్వారా ప్రజల ఎక్కడికి వెళ్లకుండా వారి ఇంటి వద్ద అన్ని ప్రభుత్వ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం పేర్కొన్నారు. సామాజిక పెన్షన్ లు ఇంటికే అందిస్తున్నారని తెలిపారు.
ఈ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బోస్ తనయుడు చినబాబు, వైఎస్సార్సీపీ నేత రెడ్డి రాజబాబు, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అలీఖాన్ బాబా, జిల్లా మైనారిటీ సెల్ కార్యదర్శి సయ్యద్ రబ్బానీ, టౌన్ కన్వీనర్ ముమ్మివరపు బాపిరాజు,అధికారి శ్రీనివాస్, చోడే సత్య కృష్ణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.