జోరుగా గ్లాసు ప్రచారం…
వేగుళ్ళ లీలాకృష్ణ ప్రచారంకు జన నీరాజనం..
మండపేట:- పురపాలక సంఘ ఎన్నికలలో భాగంగా మండపేట 8వ వార్డు జనసేన కౌన్సిలర్ అభ్యర్థి జొన్నడ పాపయమ్మ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ ప్రాచారానికి మద్దతుగా జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ, వల్లూరు సర్పంచ్ దాసి మీనా కుమారిలు వార్డులో పర్యటించారు.
ఈ సందర్భంగా లీలాకృష్ణ ప్రచారంకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. జనసైనికులు కోలాహలంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఇంటింటికి వెళ్ళి జనసేనపార్టీ అభ్యర్థి జొన్నడ పాపయమ్మను మునిసిపల్ ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సాధనకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎక్కడా వెనుకంజ వేసేది లేదని వక్కాణించారు.
కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రతి పేదవాడికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధిలు శెట్టి రవి, నామాల చంద్రరావు మరియు గోళ్ళ శ్రీను, కొంతం నాగేంద్ర ప్రసాద్, వాసిరెడ్డి అర్జున్, పైడమళ్ళ సతీష్, బొమ్మన సతీష్, కొనాల చంద్రబోస్, దాసి ఈశ్వరరావు, ఏడిద బొబ్బిలి, మోరం బాలాజీ, బండారు సతీష్, పొలమురి విజయ్, గెడ్డపు కిరణ్, గండి రాజు, వెలుపూరి ముత్తు, మామిడాల మనోకృష్ణ, వెలగదుర్తి శ్రీను, సుంకర మణికంఠ, పొన్నాడ శేఖర్, టంకాల సాయి, బండారు అయ్యప్ప, కొల్లి బాలు, చుక్క యేసు, కొత్తపల్లి కళ్యాణ్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.