జాతీయ నాయకుల విగ్రహాలకు మాస్కులతో పెట్టి ప్రజలకు అవగాహన కల్పించండి
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి మురళీధర్రెడ్డి ఆదేశాల మేరకు మండపేట మండలంలోని పంచాయతీల పరిధిలో ఉన్న మహాత్మా గాంధీ, డా.బి. ఆర్.అంబేత్కర్, ఇతర జాతీయ నాయకుల విగ్రహాలకు మాస్క్ లు పెట్టి కోవిడ్-19 నిబంధనలు పాటింపజేయడానికి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.
మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఐదం రాజు, పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్ ఆదేశాల మేరకు ముందుగా స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి మాస్క్ పెట్టి ప్రజలందరూ కూడా మాస్కు ధరించాలని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ఐదం రాజు, మండల వ్యవసాయ అధికారి బలుసు రవి, మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
![Andhra Junction](https://i0.wp.com/andhrajunction.com/wp-content/plugins/ultimate-member/assets/img/default_avatar.jpg?resize=400%2C400&ssl=1)