కొరోనా నిబంధనలు తుంగలోకి తొక్కి రికార్డింగ్ డాన్సులు
కర్నూలు జిల్లా డోన్ మండలం కమలాపురం గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఇతర ప్రాంతాల నుండి అమ్మాయిలను పిలిపించి రికార్డింగ్ డాన్సుల ప్రదర్శన నిర్వహించారు.
ఈ నృత్యాలను వీక్షించడానికి వేల మంది జనాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడికి విచ్చేసిన జనాలు చాలా మంది మాస్కులు దరించలేదు అంతటితో ఆగారా, సోషల్ డిస్టెన్స్ నియమాన్నైతే పూర్తిగా గాలికే వదిలేసారు.
వీరికి కరోనా రాదు అనుకుంటున్నారేమో కరోనా నియమాలను ఎవరు పాటించలేదు. మాస్కులు ధరించడం లేదని ఫైన్లు వేసే పోలీసు సిబ్బందికి వీరు కనబడలేదో ఏమో మరి.
![Andhra Junction](https://i0.wp.com/andhrajunction.com/wp-content/plugins/ultimate-member/assets/img/default_avatar.jpg?resize=400%2C400&ssl=1)