తెలంగాణలో కొత్తగా 204 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 60,263 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,522కి చేరింది.
ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
నిన్న కొవిడ్తో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1656కి చేరింది.
కరోనా బారి నుంచి నిన్న 170 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,97,851కి చేరింది.
రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,015 ఉండగా.. వీరిలో 624 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 37 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 92,99,245కి చేరింది.
