‘మెగా జాబ్ మేళా’కు హాజరయ్యే యువతకు ముఖ్య గమనిక…
నిరుద్యోగ యువత భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ‘మెగా జాబ్ మేళా’ నిర్వహణకు నడుం కట్టింది.
అయితే కరోనా మహమ్మారి విజృంభణ దృష్ట్యా జాబ్ మేళాను కరోనా జాగ్రత్తలు పాటిస్తూ, సురక్షితంగా నిర్వహించేందుకు వీలుగా ఉద్యోగార్థుల కోసం www.ysrcpjobmela.com వెబ్సైటును అందుబాటులోకి తీసుకువచ్చింది.
కాబట్టి ఇంతకుముందు తెలిపిన వివరాల ప్రకారం ఆయా తేదీల్లో జాబ్ మేళాలో పాల్గొనే యువత వెబ్సైట్ లో తమ పేరు, వివరాలను కచ్చితంగా రిజిస్టర్ చేసుకుని, మీ రెజ్యుమెతో పాటు వెబ్సైటులో రిజిస్టర్ చేసిన అప్లికేషన్ కూడా ప్రింట్ తీసుకుని రావాల్సి ఉంటుంది.
తద్వారా కరోనా నిబంధనలు పాటిస్తూ, ఇంటర్వ్యూ ప్రక్రియలో ఎలాంటి జాప్యం, ఇతర ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా పూర్తి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేయడమైనది.
ఉద్యోగార్థులు వెబ్సైట్ లో తమ పేరు, వివరాలు రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి అని గమనించాలి అని వైసిపి నేత రాజ్య సభ ఎంపి విజయసాయి రెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు.