విశాఖ జిల్లా గోపాలపట్నం సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం
ఇవాళ తెల్లవారు జామున 3:30 గంటలకి సబ్ స్టేషన్ లో భారీగా ఎగిసిపడిన మంటలు
మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది.
ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, అయితే జరిగిన ఆస్తి నష్టాన్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంచనా వేయాల్సి ఉంది.
సబ్ స్టేషన్ లోని ఆయిల్ మండుతూ ఉండడంతో మంటలను అదుపు చేయడం కష్టమైందని, ప్రమాదానికి కారణం ఇంకా తెలియదని గోపి కృష్ణ, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ తెలియజేశారు.
