కేంద్ర రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్కు సీఎం వైయస్ జగన్ లేఖ
రాష్ట్రంలో వివిధ రైల్వే పనుల అభివృద్ధిపై కేంద్ర రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్కు సీఎం వైయస్ జగన్ లేఖ వ్రాసారు.
ఈ లేఖలో వివిధ అభవృద్ధి అంశాలతోపాటు విజయవాడ రాజరాజేశ్వరిపేటలో ఉన్న రైల్వే భూములను ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని వినతి చేసారు.
ఇక్కడి రైల్వే భూముల్లో దాదాపు 800 కుటుంబాలు 30 ఏళ్లుగా నివాసముంటున్నాయని పేర్కొన్న సీఎం, ఈ స్థలాలను వారికి క్రమబద్ధీకరించేందుకు సహకరించాలని కోరారు.
దాదాపు 30 ఏళ్ళుగా రైల్వేశాఖకు ఏ విధంగాను ఉపయోగంలోకి రాని ఈ భూములలో ప్రస్తుతం నివాసం ఉంటున్న పేదల కుటుంబాలకే కేటాయించాలని, అందకు అణుగుణంగా రైల్వే సిబ్బందికి తగిన ఆదేశాలు అందించవలసిందిగా సిఎం జగన్ ఈ లేఖలో పియూషే గోయల్ ను కోరడమైనది.
ఈ భూములకు బదులుగా విజయవాడ నగర మునిసిపాలిటీ పరిధిలోనే ప్రస్తుతమున్న భూమికి పరిమాణంలోనూ విలువలోనూ సరిసమానమైవ రాష్ట్ర ప్రభుత్వ భూములను రైల్వే శాఖకు బదిలీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఈ సందర్భం జగన్ తెలియజేశారు.
ఈ ప్రక్రియ పూర్తయితే జగనన్న ఈ 800 పేద కుటుంబాల ఇళ్ళల్లో శాశ్వతంగా వెలుగులు నింపిన వారవుతారు.
#APCMYSJagan