భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి సెంట్రల్ జోన్ ఇన్చార్జ్ డీసీపీ పుష్పా స్పెషల్ బ్రాంచ్ అదనపు డీసీపీ జనార్థన్ తో పాటు ఏసీపీలు ఆర్.ఐలు, ఇన్స్పెక్టర్లు, పోలీసు అధికారుల సంఘం సభ్యులు మరియు ఇతర పోలీసు సిబ్బంది అంబేద్కర్ చిత్రపటం ముందు పూలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.
![Andhra Junction](https://i0.wp.com/andhrajunction.com/wp-content/plugins/ultimate-member/assets/img/default_avatar.jpg?resize=400%2C400&ssl=1)