పాకిస్తాన్ సరిహద్దులో పావురంపై కేసు.. పట్టుకున్న కానిస్టేబుల్
అంతర్జాతీయ సరిహద్దులో ఓ అనుమానాస్పద పావురాన్ని పట్టుకొని దానిపై కేసు నమోదు చేశారు.
పంజాబ్లోని బీఓపీ రోరన్వాలా దగ్గర కానిస్టేబుల్ నీరజ్ కుమార్ విధుల్లో ఉన్న సమయంలో ఓ పావురం వచ్చి అతనిపై వాలింది.
దాని కాళ్లకు ఓ పేపర్ కట్టి ఉన్నట్లు గుర్తించారు.
పాక్ సరిహద్దుకు 500 మీటర్ల దూరంలో ఈ నెల 17న ఈ ఘటన జరిగింది.
తనపై పావురం వాలిన వెంటనే ఆ కానిస్టేబుల్ దానిని పట్టుకున్నాడు.
విషయాన్ని పోస్ట్ కమాండర్ ఓంపాల్ సింగ్కు విషయాన్ని వెల్లడించగా వెంటనే దానికి స్కానింగ్ నిర్వహించారు.
దాని కాలికి కట్టి ఉన్న పేపర్పై ఓ నంబర్ రాసి ఉంది.
ఈ ఘటనపై అమృత్సర్లోని కహాగఢ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
గతేడాది మేలో జమ్ముకశ్మీర్లోని కథువాలో పాకిస్థాన్లో నిఘా కోసం శిక్షణ పొందినట్లు అనుమానిస్తున్న ఓ పావురాన్ని ఇలాగే పట్టుకున్నారు.
