జెమ్స్ హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు స్టాఫ్ నర్సులు సస్పెన్షన్
శ్రీకాకుళం.. మే 6 :- జెమ్స్ ఆస్పత్రిలో కోవిడ్ విధులకు అనధికారికంగా గైర్హాజరైన ముగ్గురు స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.సి.చంద్రనాయక్ తెలిపారు.
గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ జెమ్స్ కోవిడ్ ఆస్పత్రి సూపరింటిండెంట్ నివేదిక మేరకు జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారని ఆయన చెప్పారు.
ఈ మేరకు “మెలియాపుట్టి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం(PHC) స్టాఫ్ నర్సులు” ఎస్. రాజేశ్వరి, కె.శ్రీదేవి, మర్రిపాడు స్టాఫ్ నర్స్ బి. ఉజ్వలను సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధులను ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో చేయాల్సిందేనని స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
కోవిడ్ వంటి అత్యవసర పరిస్థితుల్లో స్వచ్చందంగా, బాధ్యతతో విద్యుక్త ధర్మంతో విధులు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.