చత్తీస్ గడ్ నారాయణ్ పూర్ జిల్లా కడేనార్ వద్ద భద్రతా దళాలతో వెలుతున్న బస్సును మందు పాతరతో పేల్చివేసిన మావోయిస్టులు.
బస్లో 25 మంది డిఆర్జి జవాన్లు ప్రయాణిస్తుండగా ముగ్గురు మరణించినట్లు సమాచారం.
సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ జవాన్లు…
పలువురి పరిస్థితి విషమం..
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జిల్లా రిజర్వు గార్డ్స్ (డీఆర్జీ) సిబ్బంది వెళ్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు.
నారాయణపూర్ జిల్లాలో 27మంది సిబ్బందితో వెళ్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతిచెందగా.. 15మందికి గాయాలయ్యాయి.
వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
![Andhra Junction](https://i0.wp.com/andhrajunction.com/wp-content/plugins/ultimate-member/assets/img/default_avatar.jpg?resize=400%2C400&ssl=1)