సీనియర్ కాంగ్రెస్ నేత ఎం ఎస్ ఆర్ కన్నుమాత
కరీంనగర్: మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత ఎం సత్యనారాయణ రావు (87) ఈరోజు ఉదయం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూత.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఎమ్మెస్సార్, చికిత్స నిమిత్తం నిమ్స్ లో చేరారు..
ఎం.సత్యనారాయణ రావు(87) స్వస్థలం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర.
న్యాయవాద డిగ్రీ పొంది, కొంతకాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసిన ఎమ్మెస్సార్ కు ముక్కుసూటిగా మాట్లాడుతారని పేరు.
కరీంనగర్ నుంచి 1971, 1977, 1980 సంవత్సరాల్లో మూడు సార్లు గెలిచి 14 సంవత్సరాలు ఎంపీగా ఎమ్మెస్సార్ పనిచేసారు.
2004-2009 వరకు కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచి 2004 నుంచి 2006 వరకు వై.ఎస్. క్యాబినెట్ లో దేవాదాయ, సినిమాటోగ్రఫీ మంత్రిగా సత్యనారాయణ పనిచేసారు.
2007-2014 వరకు ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ పదవిని సైతం అలంకరించిన ఆయన, గవర్నర్ కావాలన్నది తన చిరకాల వాంఛగా చెబుతుండేవారు.
ఇందిర ప్రధానిగా ఉన్నప్పుడు ఏఐసీసీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి 2000-2003 వరకు ఉమ్మడి రాష్ట్ర పీసీసీ చీఫ్ గా పనిచేసిన ఎమ్మెస్సార్, వయోభారంతో 2014 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.