సురుచి ఫుడ్స్ ఆధ్వర్యంలో..
108 సిబ్బంది కోవిడ్ రక్షణ సామగ్రి పంపిణీ..
మండపేట: కోవిడ్ విజృంభణ సమయంలో కూడా ఎంతో ధైర్యంగా ప్రజలకు సేవలనందిస్తున్న 108 అంబులెన్స్ సిబ్బందికి తాపేశ్వరం సురుచి ఫుడ్స్ 3 లక్షల రూపాయల విలువ చేసే సర్జికల్ గ్లోవ్స్, మాస్కులు, శానిటైజర్ లను అందజేసింది.
జిల్లాలో వున్న 68 అంబులెన్సుల సిబ్బందికి ఈ కిట్లను అందజేశారు. తాపేశ్వరం సురుచి ఫుడ్స్ ఆవరణలో గురువారం జరిగిన కార్యక్రమంలో రక్షణ కిట్లను పంపిణీ జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర మెడికల్ & హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పలివెల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలంతా కోవిడ్ కు భయపడుతూ దూరంగా ఉంటున్నా తమ 108 సిబ్బంది మాత్రం ఎంతో సేవాభావంతో సేవలందిస్తున్నారు.
వారికి రక్షణ సామగ్రి అందజేయడం ఎంతైనా సముచితమని అంటూ అందుకు సురుచి అధినేత మల్లిబాబుకు కృతఙ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో సురుచి పిఆర్ఓ వర్మ, సురుచి మేనేజర్ శంకర్ కాకినాడ, రాజమండ్రి, మండపేట ల నుండి వచ్చిన 108 సిబ్బంది, సురుచి చీఫ్ కుక్స్ మల్లి, బప్పి తదితరులు పాల్గొన్నారు.

About Post Author
AndhraJunction
Related

MLC ఎన్నికల నిర్వహణ నియమాలు జాగ్రత్తలపై బ్రీఫింగ్
జోగుళాంబ గద్వాల్ జిల్లా: ఆదివారం జరుగబోయే MLC ఎన్నికల దృష్ట్యా ఎన్నికలను ఇన్సిడెంట్ ఫ్రీ గా నిర్వహించేందుకు ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బందికి పాటించాల్సిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ గారు బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల దగ్గర విధులు నిర్వహించే సిబ్బంది తప్పనిసరిగా కోవిడ్…

దిశ ప్రత్యేక ద్విచక్ర వాహనాలు మిని వ్యాన్ ప్రారంభం
కడప జిల్లా… దిశ పోలీస్ స్టేషన్ ఆవరణంలో 50 దిశ ప్రత్యేక ద్విచక్ర వాహనాలు, ఒక మినీ వ్యాన్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అన్బు రాజన్…. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రత కోసం దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రత్యేక సిబ్బందిని నియమించడం జరిగింది…. ఆపదలో ఉన్న మహిళలకు భద్రత, రక్షణ కల్పించడం కోసం దిశ యాప్ను ఏర్పాటు చేయడం జరిగింది…. జిల్లాలోని…
ఎన్నికల విధులు నిర్వర్తించిన వారికి కృతజ్ఞతలు – డిజిపి
ప్రశాంత వాతావరణంలో కార్పొరేషన్ /నగర పంచాయతీ/మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వర్తించిన రాష్ట్ర పోలీసు సిబ్బందికి, అధికారులకు మరియు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు: రాష్ట్ర డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్ IPS. ముందస్తు ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్క పోలీస్ విధి నిర్వహణలో కనపరిచిన తీరు, సేవాతత్పరత, సమయస్ఫూర్తి, ముందస్తు చర్యలు, అన్ని శాఖలతో సమన్వయం, ఇవన్నీ కలిపి ఎన్నికలు సజావుగా నిర్వర్తించడానికి దోహద పడ్డాయి.…