ఘనంగా డొక్కా సీతమ్మ 112వ వర్ధంతి..
మండపేట: డొక్కా సీతమ్మ 112 వ వర్ధంతిని పురస్కరించుకొని బురుగుంటచెర్వు వైఎస్ఆర్ పార్కు నందు మండపేట నియోజకవర్గం బిజెపి కన్వీనర్ కోన సత్యనారాయణ ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ మాండవ్యపురం (మండపేట)లో జన్మించడం మన మనందరి అదృష్టం అని పేర్కొన్నారు.
ఆమె మరణించి వందేళ్లు దాటినా ఆ మహాతల్లి ప్రజల హృదయాల్లో జీవించే ఉన్నారన్నారు. అప్పటిరోజుల్లో అన్నమో రామచంద్ర అన్నవారికి, అడిగినవారికి కాదనకుండా అన్నదానం చేసేవారన్నారు.
ఆమె అన్నదానానికే పరిమితం కాకుండా పేదలకు చదువుకు, పెళ్లిళ్లకు ఆర్ధికసాయం చేసేవారన్నారు.
ఈ కార్యక్రమంలో స్వయం సేవక్ మేడవరపు నరసింహారావు, చండ్రమళ్ల చిట్టియ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
